అవునన్నా.. కాదన్న..

– మూడోసారి బీఆర్ఎస్ విజయం
– బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ 
– కాంగ్రెస్ కు ఓటేస్తే.. కైలాసంలో పెద్ద పాము మింగినట్టు 
– గౌరవెల్లి ప్రాజెక్టు హుస్నాబాద్ కు గొప్ప వరం
– లక్ష మందితో 15న  బహిరంగ సభ
– రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్ 
హైదరాబాద్ కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ బీఅర్ఎస్ కలిసి వచ్చే నియోజకవర్గమని, ఈనెల 15 న హుస్నాబాద్ లో లక్ష మందితో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఎవరు అవునన్నా, కదాన్న మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం ఖాయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం హుస్నాబాద్ లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లు మంత్రి పరిశీలించారు. అనంతరం పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం పాల్గొన్న మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ హుస్నాబాద్ నుండి ఎన్నికల శంఖారావం సీఎం కేసీఆర్ పూరించనున్నరని అన్నారు. అక్టోబర్ 15న లక్ష మందితో హుస్నాబాద్ గడ్డమీద ప్రజా ఆశీర్వాద సభ చేపట్టామన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో సిద్ధమైంది అన్ని వర్గాల అభ్యున్నతికి, జనరంజకమైన పాలనకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీది సుస్థిరమైన ప్రభుత్వమని, తెలంగాణలో మూడవసారి ముఖ్యమంత్రి కేసిఆర్ అవడం పక్క.. హుస్నాబాద్ లో మూడవసారి సతీష్ అన్న గెలవడం పక్క అన్నారు. బీఆర్ఎస్ ప్రతీ కార్యకర్త సైనికుడివలె పనిచేయాలని పిలుపునిచ్చారు.నేడు దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నామని, దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని ఈరోజు దేశంలోనే వరి ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.ప్రతిపక్ష పార్టీలది కల్లబొల్లి కబుర్లు తప్ప వారు ప్రజలకు చేసింది ఏమీలేదని ప్రజలందరూ అన్ని గమనించాలని కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, మూఠాల పార్టీ అని దుయ్యబట్టారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతం కల్లోలిత ప్రాంతమని నేడు అభివృద్ధికి చిరునామాగా మారిందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ వేల కోట్లతో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని, హుస్నాబాద్ నియోజకవర్గ చిరకాల వాంఛ గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. ఆసత్య సర్వేల పేరిట అధిరంలోకి వస్తామని కాంగ్రెసోల్లు గోబల్స్ ప్రచారం చేస్తున్నారనీ, కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దాయనియ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. కాంగ్రెసోల్లు ఢిల్లీలో ఎక్కువ, గల్లీలో తక్కువ, మాటలు, ముఠాలు, మూటలు, మంటలు కాంగ్రెస్ పార్టీ తీరు ఉందన్నారు. కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతి, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారని ఆరోపించారు.2004లో తెలంగాణ ఇస్తామని టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తర్వాత తెలంగాణ ఇవ్వకుండా బీఅర్ఎస్ పార్టీని మింగేయాలని చూసిందన్నారు. 2009లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క పని చేయలేదని విమర్శించారు. తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే  కైలాసంలో పెద్ద పాము మింగినట్టు తెలంగాణ అభివృద్ధి కింద పడుతుందన్నారు.ఈ నెల 15న బిఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తున్నారని అన్నారు. మూడు గంటలు, మీటర్లు పెడతామంటున్న కాంగ్రెస్, బిజెపి వాళ్ళు మంచివాళ్ళ, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంచోడా రైతులు ఆలోచించుకోవాలన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అనేక సంక్షేమ పథకాలను అమలుచేసి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని అనేక సంక్షేమ పథకాలతో , కాళేశ్వరం నీటితో తెలంగాణ సస్యశ్యామలమైందని అన్నారు ఇదే స్ఫూర్తితో హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తామని ప్రజలందరి ఆశీర్వాదం సీఎం కేసీఆర్  పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉందని అన్నారు.అక్టోబర్ 15న సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బి ఫాం లు అందించి బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి మొట్టమొదటి ఎన్నికల సభ హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారని, హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ నుండి సీఎం కేసీఆర్ ప్రజలకు తీపి కబురు చెబుతారని హరీష్ రావు అన్నారు.
ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్
హుస్నాబాద్ గడ్డ సీఎం కేసీఆర్ ఎన్నికల సమర శంఖారావం పూరించడానికి మరొకసారి వేదిక కాబోతుందని, 2018లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని తన లక్ష్మీ నియోజకవర్గంగా చెప్పుకునే హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎన్నికల సన్నాహక సభ నిర్వహించి ప్రారంభించారని అన్నారు .ఈసారి అక్టోబర్ 15న ఆదివారం మధ్యాహ్నం 3:00 గంటలకు హుస్నాబాద్ విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన లక్ష మందితో ప్రజా ఆశీర్వాద సభ ఉంటుందన్నారు. హుస్నాబాద్ గడ్డ నుండి ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసిఆర్ ప్రారంభిస్తారన్నారు.
హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం నుండి మరొకసారి సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. లక్ష మందితో అక్టోబర్ 15న ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని, హుస్నాబాద్ నియోజకవర్గం లోని ప్రతి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికులవలె పనిచేసి సభను విజయవంతం చేయాలని కోరారు. మంత్రి హరీష్ రావు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ స్థల పరిశీలన చేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస సుభాష్, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్వర్, మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మీ బిలు నాయక్, అక్కన్న పేట మండల అధ్యక్షుడు పెసరు సాంబరాజు,  హుస్నాబాద్ నియోజకవర్గ అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, హుస్నాబాద్ మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love