విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని గండివేట్ గ్రామనికి చెందిన పెద్దాపురం రాజు విద్యుత్ షాక్ తో  మృతి చెందాడు. రాజుకు 18 సంవత్సరాలు, తన సొంత వ్యవసాయ పొలం వద్ద వరి పంటకు నీళ్లు పారించడానికి స్టార్టర్ పెట్టే వద్దకు వెళ్లి మోటర్ వేస్తుండగా ప్రమాదవశాస్తు విద్యుత్ వైర్ చెయ్యికి తలిగి రాజు అక్కడికక్కడే చనిపోయినాడు. రాజుకు ఇంకా వివాహం కాలేదు. మృతుని తండ్రి గంగారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
Spread the love