సీఎం రేవంత్ ను కలిసిన వైఎస్ షర్మిల

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ షర్మిలకు శాలువా కప్పి సత్కరించి, పుష్పగుచ్ఛం అందించారు. షర్మిల ఆ తర్వాత, ప్రజాభవన్‌లో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కలిశారు. ఆయనను కూడా జయంతి కార్యక్రమానికి ఆహ్వానించారు. జులై 8న విజయవాడలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు.

Spread the love