- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు ప్రజలు విలవిలలాడుతున్నారు. ఆదివారం ఒక్కరోజే వడదెబ్బ కారణంగా మొత్తం 60 మంది(తెలంగాణలో 42, ఏపీలో 18) చనిపోయినట్లు సమాచారం. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభమవడంతో మరికొన్ని రోజులు ఎండ తీవ్రత ఉండనుంది. ఈ ఎండల దృష్ట్యా ప్రజలు అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
- Advertisement -


