బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కొలాబరేషన్లో వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. 2డీ, 3డీ రెండు ఫార్మాట్లలో ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ,’నేను ఇక్కడ పుట్టడం వల్ల చెన్నై నా ఇల్లులా అనిపిస్తుంది. మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్ర నా ఆత్మభూమి. ఈ చిత్రాన్ని వివిధ దేశాలలో 130 రోజుల్లోనే అద్భుతంగా చిత్రీకరించాం. దేవుని దయ లేకుండా ఇది సాధ్యం కాదు. ధర్మం కోసం జీవించాలి సత్యం కోసం పోరాడాలి, అన్యాయం ముందు తలవంచ కూడదు అని మన సనాతన హైందవ ధర్మం చెప్పింది. ఈ సినిమాలో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు.
భవిష్యత్ తరాలు ఈ సినిమా ద్వారా సనాతన ధర్మం గురించి నేర్చుకుంటారు. ఇది ప్రేక్షకులకు శాంతిని తెస్తుంది. బోయపాటి, మాది హిట్ కాంబినేషన్. ‘సింహ, లెజెండ్, అఖండ’ సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ఈ సినిమా కూడా ఘన విజయాన్ని సాధిస్తుంది’ అని తెలిపారు. ‘అఖండ’ రీజినల్ సినిమా కాదు ఇండియన్ సినిమా. అలాగే ‘అఖండ 2′ ఇది భారత దేశ ఆత్మ. మీరందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఆడియన్స్ని కమర్షియల్గా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ పరమశివుడే మీ ముందుకు వచ్చి ఒక మంచి సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఆ సందేశం దేశం, ధర్మం, దైవం, వేదం.. ఇది కమర్షియల్గా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది’ అని డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పారు.
ధర్మం కోసం జీవించాలి.. సత్యం కోసం పోరాడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



