- Advertisement -
నవతెలంగాణ – నర్సింహులపేట: రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ మెరుగు సత్యనారాయణ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా మరింత ఎదగాలని, కీలక పదవులు పొందాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం రాజకీయ అంశాలపై నరేందర్ రెడ్డితో సత్యనారాయణ గౌడ్ చర్చించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



