- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని మైత్రి ఫంక్షన్ హాల్ లో శనివారం కర్రెవార్ రుక్మిణిబాయి-శివరాం కుమారుడు రోహిత్ దాస్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీకి వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కర్రెవార్ కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్క్షతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దరాస్ సురేష్, కృష్ట పటేల్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



