- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. లక్షలాది సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉండటంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడానికి సమయం పడుతుందని ఇస్లామిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అధిపతి మోహసిన్ మహముది ప్రభుత్వ మీడియాకు వెల్లడించారు. త్వరలో అంత్యక్రియల తేదీని ప్రకటించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఖమేనీ జన్మించిన మషాద్లోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
- Advertisement -



