Thursday, April 16, 2026
E-PAPER
Homeక్రైమ్మద్యం మత్తులో కన్నతల్లిపై గొడ్డలితో దాడి

మద్యం మత్తులో కన్నతల్లిపై గొడ్డలితో దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తొర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామంలో బుధవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న కుమారుడు యాకయ్య తన తల్లి చిట్టిమల్ల లచ్చమ్మపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన లచ్చమ్మను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితుడు పరారైనట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -