- Advertisement -
జిల్లా కలెక్టర్ కు సర్పంచ్ ల వినతి
నవతెలంగాణ-నవాబు పేట
గ్రామ పంచాయతీల సమస్యలను పరిష్కరించాలనీ, వెనుకబడిన పంచాయతీలకు నిధులు కేటాయించాలని ఆయా గ్రామాల సర్పంచ్లు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తకు సోమవారం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొల్లూరు సర్పంచ్ సేవ్యా నాయక్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలలో నిధులు లేక గ్రామాలు అభివృద్ధికి ఆటంకంగా మారిందని అన్నారు. పంచాయతీలకు నిధులు మంజూరు చేసి పల్లెలు అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భీమయ్య తదితరులు ఉన్నారు.
- Advertisement -



