- Advertisement -
నవతెలంగాణ మహబూబ్ నగర్: ఆంధ్రప్రదేశ్ సీపీఐ(ఎం) మాజీ కార్యదర్శి, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు పి.మధు సతీమణి సుమతి మహబూబ్ నగర్ టౌన్ సుశ్రుత హాస్పిటల్ లో ఉదయం 8:30 గంటలకు మరణించారు. ఆమె ఉమ్మడి రాష్ట్ర ఐద్వా నాయకురాలిగా పనిచేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సుశ్రుత హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉదయం మృతిచెందారు. ఆమె భౌతికకాయాన్ని ఈరోజు సాయంత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి అందజేస్తారు.
- Advertisement -



