- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమంత్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ ముత్తు యాదవ్ పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో, అదుపులోకి తీసుకోవడంలో సీఐ తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు అధికారులు గుర్తించారు. స్థిరాస్తి వ్యాపారిపై దాడి, హత్యాయత్నం కేసులో సుమంత్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు.
- Advertisement -



