- Advertisement -
న్యూఢిల్లీ : వచ్చే సంవత్సరం జరిగే బ్రిక్స్ సదస్సుకు తాము ఆతిథ్యం ఇస్తామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తెలిపారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు సమావేశంలో జిన్పింగ్ ప్రసంగించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం జరిగే సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నందుకు ఆయనను అభినందించారు. జిన్పింగ్ ప్రకటనను చైనా అధికార వార్తా సంస్థ సిన్హువా, భారత్లోని చైనా రాయబార కార్యాలయం ధృవీకరించాయి. అయితే సదస్సును ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలు తెలియలేదు.
- Advertisement -



