– నిజామాబాద్లో తీవ్ర నష్టం
– ఆదిలాబాద్లో పిడుగుపాటుకు మహిళ మృతి
– నిజామాబాద్లో చెట్టు విరిగిపడి లైన్ ఇన్స్పెక్టర్ మృతి
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
సోమవారం రాత్రి వీచిన గాలులు అతలాకుతలం చేశాయి. పలు జిల్లాల్లో వర్షంతోపాటు భారీ ఈదురుగాలులు వీచాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర ప్రభావం చూపాయి. అరగంట పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా బీకర గాలులు వీచాయి. గంటకు సుమారు 40-45 కిలోమీటర్ల వేగంతో వీచినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గాలుల ప్రభావంతో నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా మొత్తం 32 స్తంభాలు విరిగిపడ్డాయి. 5 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. గాలుల తీవ్రతకు చెట్లు విరిగి స్తంబాలు, విద్యుత్ తీగలపై పడటంతో నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నగరంలోని గంగాస్థాన్ ఫేస్ 1, 2, గౌతంనగర్, బోర్గాం, వినాయక్నగర్ తదితర ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. అదే సమయంలో పిడుగుపడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ మహిళ, చెట్టు విరిగిపడి నిజామాబాద్లో లైన్ ఇన్స్పెక్టర్ మృతిచెందారు.
రాత్రంతా శ్రమించిన విద్యుత్శాఖ సిబ్బంది
విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్శాఖ అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. విద్యుత్స్తంభాలు విరిగిన చోట మళ్లీ ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేపట్టారు. విద్యుత్ స్తంభాలపై విరిగిపడిన చెట్లను, కొమ్మలను జేసీబీలతో తొలగించారు. రాత్రంతా వర్షంలోనే పని చేశారు. ఈదురుగాలులతో చెట్లు విరిగిపడి పలు చోట్ల రోడ్లపై పడిపోగా.. పోలీస్శాఖ ఆధ్వర్యంలో తొలగించారు.
చెట్టు విరిగిపడి లైన్ ఇన్స్పెక్టర్ మృతి
భారీగా గాలులు వీస్తూ వర్షం కురిసిన సమయంలో రేకుల షెడ్డు కింద నిలబడిన విద్యుత్శాఖ లైన్ ఇన్స్పెక్టర్ చెట్టు విరిగిపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని వినాయక్నగర్లో జరిగింది. విద్యుత్శాఖ బోర్గాం(పీ) సెక్షన్లో పని చేస్తున్న ఏ.శ్రీనివాస్(48).. సోమవారం రాత్రి వేగంగా గాలులు వీస్తూ వర్షం కురవడంతో.. రేకులషెడ్డు కింద నిలుచున్నాడు. గాలుల తీవ్రతకు పక్కనే ఉన్న చెట్టు విరిగి రేకులషెడ్డుపై పడింది. దాని కింద ఉన్న శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోయాడు.
విరిగిన స్తంభాలు.. కూలిన చెట్లు పలు జిల్లాల్లో భారీ గాలులతో వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES