- Advertisement -
నిర్వాహకులకు సూచనలు
నవతెలంగాణ – జూబ్లీహిల్స్ .
జూబ్లీహిల్స్ జోన్ పరిధిలోని వినాయక మండపాలను, మంగళవారం సాయంత్రం డీసీపీ రమణారెడ్డి మధురానగర్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తో కలిసి సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు తెలిపారు . అందులో భాగంగా మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, రహమత్ నగర్ చౌరస్తాలో, కాంగ్రెస్ నాయకుడు భవాని శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపాన్ని దర్శించుకుని ప్రసాదం స్వీకరించి, అక్కడ ఉన్న విజిటర్స్ బుక్కులో సంతకం చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా తొమ్మిది రోజులు పూజలు నిర్వహించుకోవాలని నిర్వాహకులకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధురానగర్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



