– కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడ్డట్టే
– ప్రతి మున్సిపల్ కార్మికునికి రూ.9వేలు పింఛన్ ఇవ్వాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ – కామారెడ్డి
పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడ్లుగా మార్చి అమలుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని, వాటిని రద్దు చేయకుంటే కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడ్డట్టే అని సీఐటీయూ రాష్ట్ర ఫ్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ప్రతి మున్సిపల్ కార్మికునికి 9 వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అధ్యక్షతన మున్సిపల్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మికుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నదని అన్నారు. కార్మికులు తమ హక్కులను కాపాడుకునేందుకు వారు పనిచేస్తున్న పరిధిలో సంఘాన్ని ఏర్పాటు చేసుకొని వారి సమస్యలను సాధించుకునేందుకు సమ్మె చేసే అవకాశాన్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సెక్షన్-సీ కల్పించిందని తెలిపారు. నాలుగు లేబర్ కోడ్ల ప్రకారం కార్మికులు సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ తమ హక్కుల కోసం పోరాటం చేయడం, పీఎఫ్, ఈఎస్ఐ ఇతర సౌకర్యాల గురించి అడిగే హక్కును కోల్పోతారని తెలిపారు. పీఎఫ్, ఈఎస్ఐ, కార్మికుల వేతనాలు.. సదరు కంపెనీ యజమాని దయ తలిస్తేనే ఉంటుందని అన్నారు. కాబట్టి ఈ నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, కర్షకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, యూనియన్ జిల్లా అధ్యక్షులు కందారపు రాజనర్సు కార్మికులు పాల్గొన్నారు.
నాలుగు లేబర్కోడ్స్ను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES