Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తల్లి పాలల్లో అనేక పోషక విలువలు..

తల్లి పాలల్లో అనేక పోషక విలువలు..

- Advertisement -

డబ్బాపాలతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం 
ఇంటింటికి అంగన్వాడి పేరుతో అవగాహన 
శుక్రవారం నుంచి తల్లిపాల వారోత్సవాలు 
నవతెలంగాణ – కాటారం

బిడ్డ స్పర్శకు ప్రతి మహిళ పరితపిస్తుంది. పుట్టిన బిడ్డ  ప్రేమను ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. ఆ సమయంలో తల్లిపాలు పసికందుకు సంజీవనిలా పనిచేస్తుందని, అనేకసార్లు వైద్య నిపుణులు నొక్కి చెప్పారు. తల్లిపాల ప్రాముఖ్యత మహిళలకు వివరించేందుకు, ప్రభుత్వం ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తుంది. సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, గర్భిణీలు,బాలింతలకు వివరిస్తారు. తల్లిపాలపై ఉన్న అపోహలను పోగొట్టి తల్లిపాల విశిష్టతను గర్భిణీలు,బాలింతలు వివరించేందుకు జిల్లా స్త్రీ  శిశు సంక్షేమ శాఖ అధికారులు, శుక్రవారం తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం చుట్టం అన్నారు.

 ప్రస్తుతం పుట్టిన గంటలో 50% మంది పిల్లలకు మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారు. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి కావలసిన అన్ని రకాల పోషక విలువలు తల్లిపాలలో ఉంటాయి. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత గంటలోపే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. దీనివల్ల బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణంగా పిల్లలకు ఐదేళ్లలోపు వచ్చే డయోరియా, వైరల్ జ్వరాలు, కామెర్లు వంటి రకరకాల వ్యాధుల నుంచి తల్లిపాలు రక్షిస్తాయి. పిల్లలకు శ్వాసకోస వ్యాధులు, అస్తమ, అలర్జీ, డయాబెటిస్, క్యాన్సర్ ఊబకాయ్ చెవిలో ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లల మానసిక పెరుగుదలకు తల్లిపాలు ఎంతో దోహదం చేయడమే కాకుండా బరువును అదుపులో ఉంచుతుంది. క్రమం తప్పకుండా పుట్టినప్పటినుంచి ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలను తప్పక ఇవ్వాలని వైద్యులు స్పష్టం  చేస్తున్నారు. 

 తల్లిపాలు అమృతం లాంటివి : శివరాణి సూపర్వైజర్ కాటారం సెక్టార్ 
ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి ఏడవ తేదీ వరకు వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తాం. అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి గర్భిణీలు, బాలింతలు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా తల్లిపాలు ప్రాముఖ్యత తెలియజేస్తాం. అమ్మ పాలు ముర్రిపాలు శిశువుకు అమృతం వంటివి. శిశు ఆరోగ్యంగా జీవించాలంటే ముర్రిపాలు పట్టించాలి. కృత్రిమ పాలు తాగిస్తే కలిగా దుష్ప్రయోజనంలపై టీచర్లు, గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పిస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -