- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలో పలు వివాహ వేడుకలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధూవరుల కుటుంబ సభ్యులతో కలిసి వారి ఆనందాన్ని పంచుకున్నారు. వధూవరుల దాంపత్య జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మద్నూర్ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుమంత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంతోష్ పటేల్, సంఘయప్ప తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



