నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 21న(ఆదివారం) దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది.ఈక్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విద్యార్థులకు కీలక అప్ డేట్ ఇచ్చింది. పరీక్ష సమయాన్ని (విండోను) 195 నిమిషాలకు పెంచింది. అంటే మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు. అభ్యర్థుల సౌలభ్యం కోసం ప్రశ్నపత్రం బుక్లెట్లో ‘రఫ్ వర్క్’ (చిత్తు పని) కోసం కేటాయించిన పేజీల సంఖ్యను రెండు నుండి నాలుగుకు పెంచింది. బుక్లెట్ ప్రారంభంలో, చివరలో ఇచ్చిన రఫ్-వర్క్ పేజీలను అభ్యర్థులు ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా ఎడమచేతి వాటం అభ్యర్థులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా, రఫ్-వర్క్ పేజీల అమరికను మార్చింది. గతంలో కేవలం బుక్లెట్ చివరలో మాత్రమే ఉండే ఈ పేజీలను, ఇకపై సూచనల పేజీ (instruction page) తర్వాత వెంటనే రెండు పేజీలను, బుక్లెట్ చివరలో మరికొన్ని పేజీలను అందుబాటులో ఉంచినట్లు ఎన్టీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది..
ఈనెల 21న నీట్ పరీక్ష..విద్యార్థులకు కీలక అప్డేట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



