- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల తప్పనిసరి వేతన పరిమితిని కేంద్ర కేబినెట్ భారీగా పెంచింది. ఇప్పటివరకు ఉన్న రూ.15వేల పరిమితిని ఏకంగా రూ.25వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ సరికొత్త నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 51 లక్షల మంది అదనపు ఉద్యోగులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది.
- Advertisement -



