- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1264 పాయింట్లు లాభపడి 78,111 వద్ద ముగిసింది. నిఫ్టీ 389 పాయింట్ల లాభంతో 24,231 వద్ద ట్రేడయింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రాబోయే రెండు రోజుల్లోనే అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి శాంతి చర్చలు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన దేశీయ సూచీలపై సానుకూల ప్రభావాన్ని చూపించింది.
- Advertisement -



