- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మందు బాబులకు బిగ్ షాక్. మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ధరలను 10-15% మేర పెంచాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. జూన్ 2 తర్వాత దీన్ని అమలు చేయాలని భావిస్తోంది. దీనిపై నియమించిన ధరల నిర్ధారణ కమిటీ మద్యం రేట్లను 25%-30% వరకు పెంచేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం వినియోగదారుల నుంచి వ్యతిరేకత రాకుండా ధరల సవరణ పేరుతో కొంతమేర పెంచాలని నిర్ణయించింది.
- Advertisement -



