- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : భగభగ మండుతున్న ఎండలు,మరోవైపు వడ దెబ్బలతో సతమతవుతున్న నేపథ్యంలో పనిచేసే ఆన్సాన్పల్లి గ్రామ ఉపాధి హామీ కూలీలకు కనీస వసతులైన నీళ్లు,నీడ ఏర్పాటు చేయడంతో ఉపాధిహామీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ నాయకుడు ఢిల్లీ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. మెడికిల్ కీట్స్,వైద్య సదుపాయం సైతం లేకపోవడంతో ఉపాధి హామీ కూలీలు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.కూలీలు అనారోగ్యానికి గురైతే బాధ్యులు ఎవరని,వెంటనే ఉపాధి హామీ కూలీలకు కనీస వసతులు కల్పించాలని ఉపాధిహామీ సిబ్బందిని డిమాండ్ చేశారు.
- Advertisement -


