- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లోని జీడిమెట్ల పరిధిలో, ప్రియుడు ఫోన్ రీఛార్జ్ చేయించలేదని మనస్తాపం చెందిన కిరణ్మయి (26) అనే యువతి శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుత్బుల్లాపూర్లోని ప్రశాంత్నగర్లో నివాసం ఉంటున్న కిరణ్మయి, ప్రయివేటు ఉద్యోగం చేసే వెంకటేశ్తో సహజీవనం చేస్తోంది. రెండు రోజుల క్రితం ఆమె ఫోన్ రీఛార్జ్ అయిపోగా, జీతం రాకపోవడంతో రీఛార్జ్ చేసుకోలేకపోయింది. ప్రియుడు కూడా రీఛార్జ్ చేయించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -


