- Advertisement -
నవతెలంగాణ-రాయికల్
మండలంలోని ఒడ్డేలింగాపూర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా అన్నప్రాసన, అక్షరాభ్యాసం,గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించగా.. గర్భిణీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం కార్యక్రమం చేపట్టారు. పోషణ, ఆరోగ్యంపై వైద్యాధికారి సతీష్ అవగాహన కల్పిస్తూ తల్లులు, గ్రామస్థులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎన్. మానస,ఉపసర్పంచ్ శంకర్, అంగన్వాడి టీచర్ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



