- Advertisement -
నవతెలంగాణ-మోపాల్
మోపాల్ మండలం హున్య నాయక్ తండాలో ఉపాద్యాయుడు ప్రేమ్ లాల్ బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో 5 గురి పిల్లలను బడి బయట పిల్లలుగా గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా క్రిమినల్ మాట్లాడుతూ గ్రామంలోని తల్లిదండ్రులందరూ తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని, అనవసరంగా డబ్బులనే వృధా చేసుకోకుండా మన గ్రామంలోనే పాఠశాల విద్యాభ్యాసం కార్పోరేట్ పాఠశాలకు ఏ రకంగాను తీసిపోదని ఆయన గ్రామంలోని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేశాడు. కార్యక్రమం లో గ్రామ సర్పంచ్, పెద్దలు తల్లి దండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -



