- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: యాక్కుత్పురా రైల్వేస్టేషన్లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గొర్రెల మేత కోసం చెట్టు ఎక్కిన ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదశాత్తు రైలు పట్టాలపై పడ్డారు. అదే సమయంలో రైలు వచ్చి ఢీ కొట్టడంతో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. చెట్టు కొమ్మ విరిగి పట్టాలపై పడటంతోనే ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అన్నదమ్ములు మరణించడంతో కుటుంబ సభ్యుల బోరున విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
- Advertisement -