Saturday, August 29, 2026
E-PAPER
Homeబీజినెస్శ్రీలంక - కువైట్ కి విమాన సేవలు ప్రారంభం

శ్రీలంక – కువైట్ కి విమాన సేవలు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – కొలంబో: ఈ ఏడాది ఆగస్టు,  నుండి కువైట్‌కు వారానికి ఆరు విమాన సర్వీసులను పునఃప్రారంభించడంతో, మధ్యప్రాచ్యంలో పూర్తి స్థాయిలో తమ కార్యకలాపాలను శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ తిరిగి ప్రారంభించింది. దీనితో ఈ ప్రాంతమంతటా తమ నెట్‌వర్క్‌ను పునరుద్ధరించుకోవటంతో పాటుగా ప్రయాణికులకు స్థిరమైన రీతిలో విమాన షెడ్యూల్ సౌకర్యాన్ని అందిస్తోంది. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ యొక్క మధ్యప్రాచ్య నెట్‌వర్క్ రియాద్, దమ్మామ్, దుబాయ్, దోహా మరియు కువైట్‌లను కలుపుతుంది. జాగ్రత్తగా రూపొందించిన షెడ్యూల్స్ ద్వారా, ప్రయాణికులు కొలంబో మీదుగా మధ్యప్రాచ్యం మరియు చెన్నై, తిరుచిరాపల్లి, తిరువనంతపురం, మదురై మరియు కొచ్చిన్ వంటి దక్షిణ భారత నగరాల మధ్య 90 నిమిషాల లోపు నిరంతరాయ కనెక్షన్‌లను పొందవచ్చు.

శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ కమర్షియల్ హెడ్ దిముతు టెన్నకూన్ మాట్లాడుతూ, “గత 40 ఏళ్లుగా మధ్యప్రాచ్యానికి ప్రయాణికులను అనుసంధానిస్తున్న విమానయాన సంస్థగా, ఈ కాలమంతా మా సేవలపై ఆధారపడిన దక్షిణ భారతదేశంలోని మా ప్రయాణికులతో కోసం, మేము ఈ ప్రాంతానికి పూర్తిస్థాయిలో తిరిగి వస్తున్నట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నాము.  ఈ మైలురాయి సౌకర్యవంతమైన కనెక్టివిటీ పునరుద్ధరణకు మాత్రమే కాకుండా, దక్షిణ ఆసియా వ్యాప్తంగా ప్రయాణికులకు మమ్మల్ని ఒక ఇష్టమైన క్యారియర్‌గా నిలిపిన నమ్మకమైన సేవ, ఆత్మీయ శ్రీలంక ఆతిథ్యం తిరిగి రావడాన్ని కూడా సూచిస్తుంది..”అని అన్నారు. 

శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ఇండియా, బంగ్లాదేశ్ , నేపాల్ రీజినల్ మేనేజర్ ఫౌజాన్ ఫరీద్ మాట్లాడుతూ, “దక్షిణ భారతదేశంలోని మా వినియోగదారులకు మేము అందించే సేవలలో మా మధ్యప్రాచ్య నెట్‌వర్క్ చాలా కాలంగా ఒక కీలకమైన భాగంగా ఉంది. గత కొన్ని నెలలుగా మా మధ్యప్రాచ్య కార్యకలాపాల పరముగా గణనీయమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ, మేము ఇతర మార్కెట్లను బలోపేతం చేయడం ద్వారా , భారతదేశం అంతటా మా వినియోగదారులకు సేవ చేయడానికి కట్టుబడి ఉండటం ద్వారా దృఢంగా నిలబడ్డాము. మేము మా పూర్తి మధ్యప్రాచ్య నెట్‌వర్క్‌ను పునరుద్ధరిస్తున్నందున, నూతన విశ్వాసంతో ఈ ఊపును కొనసాగించడానికి, మా ప్రయాణికులు విలువ ఇచ్చే నిరంతరాయ కనెక్టివిటీ, నమ్మకమైన సేవ మరియు ఆత్మీయ శ్రీలంక ఆతిథ్యాన్ని అందించడం కొనసాగించడానికి మేము ఆసక్తిగా ఉన్నాము” అని అన్నారు. 

ఇండియా మరియు కొలంబో మధ్య వారానికి 90 విమాన సర్వీసులను నడుపుతూ, చెన్నై, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురం, మదురై మరియు తిరుచిరాపల్లి నగరాలకు సేవలు అందిస్తున్న శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్, భారతదేశాన్ని తమ అతిపెద్ద మార్కెట్‌గా గర్వంగా చెప్పుకుంటుంది. ప్రయాణికులు విమానం ఎక్కిన క్షణం నుండి శ్రీలంకన్ ఆతిథ్యపు ఆప్యాయతను ఆస్వాదించవచ్చు. దీనికి తోడు, ఎయిర్‌లైన్ యొక్క అవార్డు గెలుచుకున్న మెనూలో ప్రాంతీయంగా ఇష్టపడే వంటకాలతో పాటు శాకాహార , మాంసాహార వంటకాలు కూడా లభిస్తాయి. విమానయాన సంస్థ యొక్క ఇన్-ఫ్లైట్ వినోద వ్యవస్థలో అందుబాటులో ఉన్న తాజా తమిళ, మలయాళ, తెలుగు మరియు హిందీ చిత్రాల విస్తృత ఎంపికను అందిస్తుంది. 

శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్, దక్షిణ భారతదేశం మరియు మధ్యప్రాచ్యం మధ్య ప్రయాణించే కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన బ్యాగేజ్ అలవెన్సులను కూడా అందిస్తుంది. ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు 7 కేజీల క్యాబిన్ బ్యాగేజ్, 30 కేజీల చెక్డ్ బ్యాగేజ్‌కు అనుమతి ఉంటుంది.  మరిన్ని వివరాలకు మరియు బుకింగ్‌ల కోసం, www.srilankan.comని సందర్శించండి లేదా సోషల్ మీడియాలో మమ్మల్ని అనుసరించండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -