- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
జాతీయ మాలమహనాడు మండల అధ్యక్షుడుగా మండలంలోని వల్లెంకుంట గ్రామానికి చెందిన పసుల పోశయ్యను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా మాలమహానాడు రాష్ట్ర నాయకుడు బండి రాజయ్య ఆదివారం ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గత కొన్ని సంవత్సరాలుగా మాలమానాడులో క్రియ శీలకంగా పని చేస్తూ,మాల జాతి కోసం రాష్ట్ర నాయకులు పిలుపు ఇవ్వగానే వెంటనే స్పందిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం మాలకు రోస్టర్ విధానంపై జరుగుతున్న నష్టం పై ధర్నాలు,రాస్తారోకోలు ,పోరాటాలు చేస్తున్న పోచయ్యను గుర్తించి జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల ప్రభాకర్,ఆదేశాల మేరకు మండల అధ్యక్షునిగా ప్రకటించడం జరిగిందన్నారు.
- Advertisement -



