నవతెలంగాణ – హైదరాబాద్ :బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ద్రోణి మరింత బలపడనుండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ వంటి తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES