- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలోని మహవీర్ ఆస్పత్రిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నారికి జ్వరం ఉందని ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆస్పత్రిలో చేర్చుకోవడంలోనూ, వైద్యం చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చేశారని, అందుకే పాప చనిపోయిందని కన్నీరు మున్నీరయ్యారు.
- Advertisement -



