నవతెలంగాణ-హైదరాబాద్: పాలమూరులో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. కోల్లాపూర్ మండలం నార్లపూర్ ప్యాకేజీ-2,3 కాల్వ పనులను పరిశీలిస్తున్నారు. సంబంధింత అధికారులతో పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్, జూపల్లి, శ్రీహారి ఉన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కుమ్మెరలో పీఆర్ఎల్ఐఎస్ ప్యాకేజీ-8 స్టేజ్-3 పంప్హౌస్, వట్టెం రిజర్వాయర్కు సంబంధించిన ప్యాకేజీ – 9, 10, 11 పనులు పరిశీలన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూర్ లోని పీఆర్ఎల్ఐఎస్కు చెందిన కరివేన రిజర్వాయర్ ప్యాకేజీ- 14, 15 పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ లో పీఆర్ఎల్ఐఎస్కు చెందిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీలు 17, 18 పనులను పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు ఉద్దండాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొంటారు.
పాలమూరులో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



