Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఅర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలి: సీపీఐ(ఎం)

అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీలో అనర్హులకు ఇండ్లు కేటాయించారని సీపీఐ(ఎం) కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. ప్రధానంగా బిక్నూర్ మండల కేంద్రంలో జరిగిన ఇండ్ల పంపిణీలో అనర్హులు ఉన్నారని, అధికారులు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ అర్హులకు కేటాయించకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని తెలిపారు. సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

వెంటనే స్పందించిన కలెక్టర్ హౌసింగ్ జిల్లా అధికారిని వెంటనే రీ ఎంక్వయిరీ చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఏ విధంగా జరిగిందో వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. బిక్నూర్ లో మీ కుటుంబాలు గ్రామస్తులు ఇండ్లలో అద్దెకు ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇళ్ల స్థలాల కోసం ఆందోళన పోరాటాలు కొనసాగించాలని, అర్హులకు ఇవ్వకుండా ఇండ్లున్నవారికి, ఉద్యోగులకు కేటాయించడం సరైంది కాదన్నారు. ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే  సైతం అభ్యంతరం తెలిపినట్టు ఆయన గుర్తు చేశారు. అర్హులైన పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు,  నాయకులు రహిమ, హైమ, బేగం, పుష్ప, లక్ష్మి, మంజుల, భాష, లక్ష్మి, నజియా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img