దుబాయ్: పశ్చిమ దేశాల్లో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్న ఆందోళనలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గురువారం తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.86 శాతం తగ్గి బ్యారెల్కు 104.9 డాలర్లకు చేరగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ధర 1.01 శాతం తగ్గి 101.4 డాలర్ల వద్ద ట్రేడైంది. అంతకుముందు బుధవారం కూడా రెండు ప్రధాన క్రూడ్ ఆయిల్ బెంచ్మార్క్లు గణనీయంగా పడిపోయాయి. ఒమన్ మీదుగా ముడి చమురు ఎగుమతులను పెంచేందుకు సౌదీ అరేబియా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వచ్చిన వార్తలు మార్కెట్పై ప్రభావం చూపాయి. ఒమన్లోని సోహార్ పోర్టు సమీపంలో షిప్-టు-షిప్ బదిలీల ద్వారా ఆసియాలోని చమురు కేంద్రాలకు అదనపు ముడి చమురును సరఫరా చేయనున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతాల నుంచి ఎర్ర సముద్రం వైపు ముడి చమురును తరలించే ఈస్ట్-వెస్ట్ పైప్లైన్పై దాడులు జరిగిన నేపథ్యంలో ఈ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాన్ని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. పైప్లైన్ ద్వారా సాధారణ స్థాయిలో ఇంధన సరఫరాలను పునరుద్ధరించేందుకు మరింత సమయం పడుతుందని సౌదీ అరేబియా పేర్కొంది. ఒమన్ మార్గంలో అదనపు సరఫరాలు అందుబాటులోకి వస్తాయన్న అంచనాలు ప్రపంచ మార్కెట్లో సరఫరా కొరతపై ఆందోళనలను కొంతమేర తగ్గించాయి. దీంతో ముడి చమురు ధరలపై ఒత్తిడి ఏర్పడినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఒమన్ ద్వారా చమురు సరఫరాకు సౌదీ ప్రణాళిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



