ఉచితంగా వైద్యం అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 5న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో, అదే జిల్లాలోని బసంత్నగర్కు చెందిన గుంటిపల్లి రాము, ఆయన భార్య అనూష మరణించారు. వీరి మూడున్నరేండ్ల కూతురు సహస్ర తీవ్రంగా గాయ పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆమెను తొలుత కరీంనగర్కు, అక్కడి నుంచి మంగళవారం హైదరాబాద్లోని రెయిన్బో ఆస్పత్రికి తరలించారు. సహస్ర పరిస్థితిపై మీడియాలో వచ్చిన వార్తలు చూసి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చలించి పోయారు. సహస్ర ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. చిన్నారి సహస్రకు పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. చికిత్సకయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. మంత్రి ఆదేశాలతో హైదరాబాద్ డీఎంహెచ్వో, డాక్టర్ వెంకట్ రెయిన్బో హాస్పిటల్కు వెళ్లి సహస్ర ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. సహస్ర వెన్నుపూసకు తీవ్ర గాయమైందనీ, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు వివరించారు. సహస్రకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు డీఎంహెచ్వో వెంకట్ సూచించారు.
చిన్నారికి అండగా నిలిచిన మంత్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES