నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్లలోని 17వ బెటాలియన్ లో జాతీయ రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అధికారులు మరియు సిబ్బంది అంతా రాజ్యాంగ ప్రవేశిక లోని వాక్యలైన “భారత దేశ ప్రజలమైన మేము సర్వసత్తాక,సామ్యవాద,లౌకిక,ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని భావప్రకటన,విశ్వాసం,ఆరాధనలో స్వేచ్ఛను, అవకాశంలో సమానత్వంను మరియు సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు తీర్మానించుకుని మన రాజ్యాంగ పరిషత్ లో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము” అని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎస్. సురేష్, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ బెటాలియన్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



