- Advertisement -
నవతెలంగాణ-ముధోల్
నియోజక వర్గ కేంద్రమైన ముధోల్ లోని జఠశంకర్ ఆలయం సమీపాన ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ముధోల్ ఎస్సై బిట్ల పెర్సెస్ కథనం ప్రకారం.. తానుర్ మండల కేంద్రంకు చెందిన సంతోష్ (24) అనే యువకుడు లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లా పూర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుండిద్విచక్ర వాహనంపై తన స్వ గ్రామమైన తానూర్ కు బయలు దేరాడు. అయితే ముధోల్ లోని జఠ శంకర్ ఆలయం సమీపంన మార్గమద్య లో ద్విచక్ర వాహనంనియంత్రణ కోల్పోయి కింద పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తునట్లు ఎస్సై తెలిపారు.
- Advertisement -


