నవతెలంగాణ-హైదరాబాద్: బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా నేడు ఈడీ ముందు విచారణకు సినీనటుడు దగ్గుబాటి రాణా హాజరయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సినీనటుడు ప్రకాష్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండ, పలువురు సినీనటులకు ఈడీ అధికారులు నోటీసులు పంపారు.
ఈ నోటీసులలో భాగంగా ఇప్పటికే ప్రకాష్ రాజ్తో పాటు విజరు దేవరకొండ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక ఈ విచారణలో భాగంగా తాజాగా రాణా కూడా హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు పలువురు సినీ సెలబ్రిటీలపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ల ప్రమోషన్ ద్వారా పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్ల ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.