- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో నిన్న (ఆదివారం) పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో అత్యధికంగా 76.8మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్లో 51.0, కందిలో 42.5, కడ్పాల్లో 41.3, కామారెడ్డి జిల్లా మచ్చాపూర్లో 40.8మి.మీ. వర్షం కురిసింది. సోమవారం, మంగళవారాల్లో పలు చోట్ల తేలిక పాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
- Advertisement -



