- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్ : తమిళనాడులో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. విరుద్ నగర్ జిల్లాలోని ఓ బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా పలువురు గాయపడినట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక బృందాలు.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రులను ఆదేశించారు.
- Advertisement -



