నవతెలంగాణ-హైదరాబాద్: నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్కు ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దేబాశిష్ సమంతరాయ్ సోమవారం నాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నవీన్ పట్నాయక్కు పంపారు. పార్టీలో తనకు తగినంత గుర్తింపు లేకపోవడం, తన సేవలు పార్టీకి అంతగా అవసరం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు.
రాజీనామా అనంతరం సమంతరాయ్ మాట్లాడుతూ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్కు ఈరోజు ఉదయమే లేఖ రాశానని చెప్పారు. ఆ వెంటనే రాజ్యసభ వైస్ చైర్మన్ను కలిసి రాజ్యస సభ్యత్వానికి రాజీనామా లేఖను అందజేసినట్టు చెప్పారు. జాతీయ స్థాయిలో అవిభక్త కటక్ జిల్లాకు, ఒడిశాకు సేవలందించేందుకు రాజ్యసభకు తనను నామినేట్ చేసిన నవీన్ పట్నాయక్కు కృతజ్ఞతలు తెలిపారు.



