Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాల మున్సిపాలిటీలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' వార్డు సభలు

పరకాల మున్సిపాలిటీలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ వార్డు సభలు

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల పురపాలక సంఘం పరిధిలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వివిధ వార్డులలో సభలను ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీలోని 1, 2, 9, 11 మరియు 13వ వార్డులలో జరిగిన ఈ సభలలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలతో ముఖాముఖి చర్చలు జరిపారు. స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు, వార్డుల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజల నుండి అనేక సూచనలను, వినతులను అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్ మాట్లాడుతూ.. వార్డులలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా మరియు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు దుబాసీ వెంకటస్వామి, బొచ్చు శ్యామల బాబురావు, బెజ్జంకి పూర్ణ చారి,గుడెల్లి సదన్ కుమార్,మతి బొచ్చు మాధవి లత, మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రంజి వెంకట్ రెడ్డి, వార్డు అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -