హీరో సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’తో త్వరలోనే ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ చిత్రానికి స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కతిప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.
సోమవారం మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. అక్టోబర్ 17న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా రాకతో దీపావళి మరింత సందడిగా మారబోతోంది. హోల్సమ్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు.
రిలీజ్ డేట్ పోస్టర్ విజువల్ ఫీస్ట్లా ఉంది. ప్రేక్షకులను తెలుసు కదా వరల్డ్లోకి తీసుకెళ్ళింది. అనౌన్స్ మెంట్ వీడియో కూడా ఆసక్తికరంగా ఉంది. హీరో ఇద్దరు హీరోయిన్స్ మధ్య చిక్కుకునే కాన్ఫ్లిక్ట్ని ప్రజెంట్ చేస్తోంది. దర్శకురాలు నీరజ కోన తన మొదటి చిత్రంతో తెలుగు సినిమాకు ఒక కొత్త వాయిస్ని అందిస్తున్నారు. ఇది మనసుని తాకేలా, ఊహించని మలుపులతో నిండిన కథగా ఉండబోతోంది. న్యూ జనరేషన్ నిర్మాత కతి ప్రసాద్ ఈ చిత్రం కథా చర్చల నుంచే డైరెక్టర్తో దగ్గరగా కలిసి పనిచేశారు. స్క్రిప్ట్ నుండి మౌంటింగ్, ఎగ్జిక్యూషన్ దాకా ప్రతిదశలోనూ కొలాబరేట్ అయ్యారు. ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు.
‘తెలుసు కదా’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -