- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యానికి హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. కోర్సు మధ్యలోనే చదువు ఆపేసిన ఒక విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికేట్లను తిరిగి ఇవ్వకుండా.. అదనపు ఫీజు డిమాండ్ చేస్తూ వేధించినందుకు గాను పెద్ద ఎత్తున జరిమానా విధించింది. కాలేజీ వైఖరి వల్ల విద్యార్థి విలువైన విద్యా సంవత్సరాలు నష్టపోవడమే కాకుండా తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడని పేర్కొంటూ.. ఇందుకు బాధ్యతగా సదరు విద్యార్థికి రూ.1 లక్ష నష్ట పరిహారంతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం మరోరూ.10,000 అదనంగా చెల్లించాలని సంచలన తీర్పునిచ్చింది.
- Advertisement -



