- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్లోని ఉప్పల్ మెట్రోస్టేషన్లో బాంబు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. ఈ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా బాంబులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
- Advertisement -



