- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలోని ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లలమర్రి శివారులో జరిగిన ఈ ఘటనలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి చెందారు. జావీద్ ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జావిద్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
- Advertisement -



