- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో భూముల ధరలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని, త్వరలో ధరలు పెంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భూముల ధరలు పెంచలేదని, ధరణి సమస్యలు భూభారతితో పరిష్కారమవుతాయని ఆయన హామీ ఇచ్చారు. భూముల రిజిస్ట్రేషన్ మ్యాప్తో ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, పాలేరులో మొదటి రిజిస్ట్రేషన్ జరుగుతుందని స్పష్టం చేశారు. రెవెన్యూలో కొత్త పాలసీ తేబోతున్నామని, కేబినెట్ విస్తరణ విడతల వారీగా జరుగుతుందని వెల్లడించారు.
- Advertisement -



