- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేయడంతో పాటు, సాగు ఖర్చులను తగ్గించేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ట్రాక్టర్లు, యంత్రాలకు ఇచ్చే రాయితీ నిధులను ఈసారి నేరుగా అన్నదాతల అకౌంట్లోనే జమ చేస్తామని పేర్కొన్నారు. కాగా ఈ స్కీమ్ కోసం దాదాపు 5.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేవని, యూరియా 2.79L టన్నులు, డీఏపీ 22K టన్నుల స్టాక్ ఉందన్నారు.
- Advertisement -



