- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సామాన్య వాహనదారులకు, ఆటో-క్యాబ్ డ్రైవర్లకు ఊహించని షాక్ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో (ఎన్సీఆర్) CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ధరలు భారీగా పెరిగాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) కిలో CNGపై ఏకంగా రూ. 3.89 పెంచుతున్నట్లు ప్రకటించింది. శనివారం ఉదయం (ఆగస్టు 29) నుంచే ఈ పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ సవరణతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ. 86.98కి చేరింది.
- Advertisement -



