రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేశ్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో మా ఆయి క్రియేషన్స్ బ్యానర్ మీద రూపేశ్ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’.
పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం కల్చరల్ బ్లాక్బస్టర్ ఈవెంట్ను మేకర్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ”షష్టిపూర్తి’ అనేది కల్చరల్ బ్లాక్బస్టర్ కాదు.. కల్ట్ బ్లాక్ బస్టర్. ‘పెళ్లి పుస్తకం’ నుంచి ‘షష్టిపూర్తి’ వరకు ఏ నటుడికి దక్కని సినిమా జర్నీ నాకు దక్కింది. థియేటర్లలో అందరూ చూసి ఏడ్చేస్తున్నారంటేనే మేం సక్సెస్ అయినట్టు. మాతో ఇలాంటి ఓ గొప్ప కథను, సినిమాను పవన్ ప్రభ చెప్పారు. ఇలాంటి చిత్రాలెన్నో ఇంకా రావాలి. ఇలాంటి అద్భుతమైన పాత్రలు నా చివరి శ్వాస వరకు చేయాలని కోరుకుంటూనే ఉంటాను’ అని తెలిపారు. ‘మా సినిమాని ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు, మీడియాకు థ్యాంక్స్. ఇళయరాజా మ్యూజిక్, తోట తరణి సెట్స్ను బిగ్ స్క్రీన్లో చూస్తేనే ఆ ఫీలింగ్ కలుగుతుంది. కొత్త వారు చేసిన పాత్రల్ని కూడా ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ లేకపోతే ఈ చిత్రం లేదు. రాజేంద్ర ప్రసాద్, అర్చన సహకారంతోనే ఈ చిత్రంలో నటించాను. నా నటనను మెచ్చుకుం టున్నారంటే వారే కారణం. క్లైమాక్స్ చూసి చాలా మంది ఏడ్చేస్తున్నారు’ అని హీరో, నిర్మాత రూపేశ్ చెప్పారు.
దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ, ‘మౌత్టాక్తో మా సినిమా ముందుకు వెళ్తోంది. కుటుంబ విలువలు, ప్రేమ అనేది ప్రతీ ఒక్కరిలో ఉంటాయి. వాటినే నమ్ముకుని ఈ సినిమాను తీశాను. ఇది తల్లిదండ్రులతో పాటుగా సాగే ఓ కొడుకు కథ. ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా’ అని అన్నారు.
కల్చరల్ కాదు..కల్ట్ బ్లాక్బస్టర్
- Advertisement -
- Advertisement -